జగనన్నకు చెబుదాంపై అవగాహన కల్పించండి


Ens Balu
17
Kakinada
2023-04-19 14:47:41

సీఎం ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం  అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జగనన్నకు చెబు దాం కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.  కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరు డా కృతికా శుక్లా..జాయింట్ కలెక్టరు ఎస్ .ఇలక్కియా ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రతి సోమవారం జిల్లాలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమా నికి శాఖల వారీగా వస్తున్న అర్జీలు వివరాలు, వాటి పరిష్కారాని అనుసరిస్తున్న విధానం, ప్రజల సంతృప్తి స్థాయి, జిల్లాస్థాయి అధికారులు తీసుకో వాల్సిన చర్యలపైనా అవగాహనపైనా ఆమె దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీ సీఈవో ఎన్. వి.వి.సత్యనారాయణ, సీపీవో పీ.త్రీనాథ్, బిసీ కార్పొరేషన్ ఈడి ఎస్.వి.ఎస్‌.సుబ్బలక్ష్మి, అగ్రీ జెడి ఎన్ విజయ్ కుమార్, డీపీవో ఆర్ విక్టర్, హౌ సింగ్ పీడీ బి సుధాకర్ పట్నాయక్, డీఎం సివిల్ సప్లయ్ డీ.పుష్పమణి  తదితరులు పాల్గొన్నారు.