ఆజాద్ ఎంట్రీ ఇక అప్పన్న ఆలయంలో ఆ.. ఆటలు సాగవు


Ens Balu
84
Visakhapatnam
2023-04-21 04:21:50

ఆయనపేరు చంద్రశేఖర్ ఆజాద్.. దేవాదాయశాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. ఈన కున్న లెక్కతోనే..ఎక్కడైనా తిక్కపనులు చేసే సమయంలో ప్రభుత్వం ఆయనను అక్కడ నియమిస్తుంది. ఇపుడు శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలోనూ ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఒక్కముక్కలో చెప్పలంటే మా ఆటలకు అడ్డులేదని రొమ్మువిరు చుకు నే ఎలాంటి వారికైనా ఈయన స్టైల్ లో ట్రీట్ మెంట్ ఇవ్వడం అలవాటు. ఈ అధికారి ట్రాక్ రికార్డ్ ను గుర్తించే దేవాదాయశాఖ ప్రత్యేకం గా ఈయనను కీలకమైన దేవస్థానాలకు ఈఓగా నియమిస్తుంది. ఇపుడు  23న జరగబోతున్న స్వామి వారి చందనోత్సవం ప్రత్యేక అధికారి రీజ నల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించింది. ఈయన పనిచేసేచోట నిబంధనలు మాత్రమే పనిచేయాలి.. సొంత నిర్ణ యాలు తీసుకుంటే మాత్రం ఒంటికాలిపై లేస్తారు..ఆ తరువాత మాటలుండవు.. మాట్లాడుకోవడాలుండవు.. అన్నీ కఠిన చర్యల ఫలితాలే..!