ఎంపీ ఎంవీవీని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి..


Ens Balu
4
Visakhapatnam
2020-09-27 14:25:52

విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యన్నారాయణను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో  మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకి సాలువకప్పి, పుష్పగుచ్చం అందించి ఎంపీతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, పార్లమెంటు విశాఖ వాణి వినిపించడంలో ఎంపీ ఎంవీవీ ముందున్నారని అన్నారు. ఇదే ఉత్సాహంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి, ప్రత్యేక్ రైల్వేజోన్, సెంట్రల్ యూనివర్శిటీ, పోలవరం పూర్తికి నిధులు తదితర అంశాలపై డిమాండ్ పెంచాలని ఎంపీపీ కోరారు. విశాఖ వాసుల ఆశలకు అనుగుణంగా పార్లమెంటులో ఎంపీ వ్యవహరించడం శుభపరిణామం అన్నారు. ఎందరో ఎంపీలు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించినా విశాఖకు ఒరింగింది ఏమీ లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా ఇటు పార్లమెంటులోనూ, అటు రాజ్య సభలోనూ ఎంపీల వాణి బలంగా వినిపించి చాలా అంశాలకు ఒక క్లారిటీ తెచ్చేలా క్రుషి చేశారని వాసుపల్లి కొనియాడారు.