అక్షయ క్షేత్రం కేంద్రాలను పరిశీలించిన జేఈవో


Ens Balu
1
Tirupati
2023-04-25 10:21:55

రామచంద్రాపురం మండలంలోని దుర్గ సముద్రం, రేణిగుంట అక్షయ క్షేత్రం మానసిక వికలాంగుల, ప్రత్యేక అవసరాలు కల వారి సేవా కేం ద్రాలను టీటీడీ జేఈవో సదాభార్గవి మంగళవారం సందర్శించి సేవలు పొందుతున్న వారిని చూశారు. కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి వివ రాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, అక్షయ కేంద్రానికి టీటీడీ ఏడాదికి రూ 15 లక్షల మేరకు ఆర్థిక సహా యం చేసేదన్నారు. కోవిడ్ ప్రబలినప్పటి నుండి ఈ సహాయం నిలిపి వేసినట్లు ఆమె తెలిపారు. తిరుమల, తిరుపతి లోని మానసిక వికలాంగు లు, ప్రత్యేక అవసరాలున్న వారిని ఈ కేంద్రాలకు తరలించి సేవలు అందిస్తున్నారని ఆమె చెప్పారు.  ఇక్కడి పరిస్థితిలను పరిశీలించి ఈవో కు నివేదిక అందిస్తామని, ఆర్థిక సహాయం పునరుద్ధరణ కు సంబంధించి ఆయన నిర్ణయం తీసుకుంటారని జేఈవో వివరించారు.డిఈవో భా స్కర రెడ్డి,పిఆర్వో డాక్టర్ రవి, బాల మందిరం ఎఈవో అమ్ములు ఇతర అధికారులు పాల్గొన్నారు.