చాపా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్పాహార వితరణ


Ens Balu
21
Visakhapatnam
2023-04-25 13:29:39

విశాఖలోని చాపా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు బాలక్రిష్ణ నిరాశ్రయులైన రోడ్డుప్రక్క అనాధలకు అల్పాహారం వితరణ కార్య క్రమం చేపట్టారు. ఈ మేరకు మంగళవారం విశాఖలోని  రైల్వేస్టేషన్ కి వెళ్లేదారిలోని దొండపర్లి ఫ్లై ఓవర్ క్రింద ఉన్న 50మందికి పెరుగువడ, నేతి వడలు, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాపా బాలక్రిష్ణ మీడియాతో  మాట్లాడుతూ, నిత్యం నిరుపేద భక్తులను కాశీ యాత్రకు ఉచితంగా తీసుకెళ్లి వస్తుంటామని, ఆ సందర్భంలో యాత్రముగించుకొని వచ్చిన తరువాత ఇలా అన్నదాన సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆశ్రమంలోని భక్తులతోపాటు, రోడ్డుప్రక్కన నిరాశ్రయులైన వారికి కూడా తమ ట్రస్టుద్వారా ఆహారాన్ని అందిస్తుంటా మని చెప్పారు. ఇదేరోజు ఆశ్రమంలో కూడా 50 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిపిట్టు వివరించారు. ఆ పరమశివుని కరుణతో తన వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.