అనకాపల్లిలో 80% పూర్తైన జగనన్నే మా భవిష్యత్తు


Ens Balu
22
Anakapalle
2023-04-29 07:02:52

జగననన్నే మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాలు అనకాపల్లి నియోజకవర్గంలో 80% పూర్తిచేసినట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు పేర్కొన్నారు. శనివారం అనకాపల్లిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దంతులూరి దిలీప్ కుమార్ కలిసి ఆ యన మీడియాతో మాట్లాడారు. సీఎం పిలుపుమేరకు 19 రోజులపాటు చేపట్టిన కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పంద వచ్చిందన్నారు. మ ళ్లీ గుడివాడ అమర్నాధ్ నే ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామనే మాట ప్రతీ ఒక్కరి నుంచి పెద్దఎత్తున వస్తుందన్నారు. వైెఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అడగమన్న 5 ప్రశ్నల ద్వారా ప్రజల సమాధానాలు స్వీకరించడం తోపాటు మద్దతు కూ డా పొందామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పొందిన వారు ప్రభుత్వం సూచించిన నెంబరుకి మిస్డ్ కాల్స్ కూడా తమ మద్దతుని తెలియజేశా రని చెప్పారు. మండల అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, గైపూరు రాజు, జాజుల రమేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

సిఫార్సు