విశాఖలో ఉత్కంఠ.. విజెఎఫ్ పై 12న వచ్చే నివేదిక అదేనా..?!


Ens Balu
152
Visakhapatnam
2023-05-10 17:11:11

విశాఖలోని జర్నలిస్టుల్లో ఉత్కంఠ కట్టలు తెంచుకుంటోంది.. వైజాగ్ లో ఏఇద్దరు జర్నలిస్టులు తారసపడినా ఇదేటాపిక్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)పై జిల్లా కలెక్టర్ డా. మల్లిఖార్జున వేసిన త్రిసభ్య కమిటీ నివేదిక ఏం తేల్చబోతుందనేది. 12ఏళ్లుగా విజెఎఫ్ అనధికార, కాలం చెల్లిన కార్యవర్గం సొసైటీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన విధానా లపై జర్నలిస్టులు చేసిన ఫిర్యాదుమేరకు కలెక్టర్ కమిటీ వేయడం, అధికారులు రిపోర్టు తయారుచేయడం జరిగిపోయాయి. కాకపోతే నాటి నుంచి నేటి వరకూ కలెక్టర్ ఆని వేదికను ప్రకటించలేదు. ఇటీవలే ముదపాకలో కలెక్టర్ ను కలిసిన మీడియా విజెఎఫ్ విచారణ నివేదిక ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించగా,12న ప్రకటిస్తామని చెప్పారు. దీనితో ఆనాటి నుంచి ఆ ఉత్కంఠ మరింత ఎక్కువైపోయింది ఇటు జర్నలిస్టులు, అటు కాలంచెల్లిన కార్యవర్గంలో కూడా. అయితే కమిటీ విచారణ తరువాత చాలా రకరకా లపుకార్లు షికార్లు చేశాయి. ఈసమయంలో కొందరు ఫోన్లుచేసి విజెఎఫ్ సభ్యులను ఫోన్లలో బండబూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడటం, కులసంఘాలను, ప్రజాప్ర తినిధులతో తెరచాటు సంప్రదింపులు చేసినా ఫలితం లేకపోయింది.12న నివేదిక విడుదలకానుంది..!