వెంగమాంబ దాన పత్రాలు పుస్తకావిష్కరణ


Ens Balu
5
Tirupati
2023-05-17 16:14:32

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ దానపత్రాలు పుస్తకాన్ని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో  బుధవారం టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి ఆవిష్కరిం చారు. డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, డాక్టర్ నాగోలు కృష్ణారెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు. శ్రీవెంగమాంబ కాలానికి సంబంధించిన 33 దాన శాసనాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ధన,వస్తు రూపంలో ఇచ్చిన దానాలకు సంబంధించిన శాసనాలను పరిష్కరించి ఈ పుస్తకంలో పొందుపరచారు.  ఈ విరాళాల ద్వారా ఆమె తిరుమలలో ప్రతి ఏటా పది రోజుల పాటు నృసింహ జయంతి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించేవారని దాన పత్రాల్లో ఉంది. ఉత్సవాల రోజుల్లో పేదలకు అన్నదానం, చలి వేంద్రాలు మొదలైన ధర్మ కార్యాలు నిర్వహించేవారని ఇందులో ఉంది. స్వీకరించిన దాదాపు 33 దానాలకు సంబంధించి దానకర్త పేరు, దాన విషయం మొదలైన విషయాలన్నీ ఇందులో పొందు పరచబడ్డాయి.   జేఈవో లు  సదాభార్గవి, వీరబ్రహ్మం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.