స్విమ్స్ కి రూ.25 విరాళం..


Ens Balu
1
Tirumala
2020-09-27 17:46:52

తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్విమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్ ల్యాబ్ అభివృద్ధికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవి సన్నారెడ్డి రూ. 25 లక్షలు విరాళమిచ్చారు. ఆదివారం ఈ మేరకు ఆ చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో శ్రీవారి ఆసుపత్రి ద్వారా ఎందరో నిరుపేదలకు వైద్య సహాయాం అందించారని, మరింత ఎక్కువ మందికి కోవిడ్ వైద్య సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా వైరస్ పరీక్షలు చేసే ల్యాబ్ ను ఆధునీకరించాలని ఆయన కోరారు. స్వామివారి ఆసుపత్రికి ఎందరికో ప్రాణదానం చేయాలని ఆకాంక్షించారు. దాత సూచనలు తప్పక స్వీకరిస్తామన్నారు చైర్మన్ వైవీ. ఈ కార్యక్రమంలో టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు  శేఖర్ రెడ్డి కూడా దాతతోపాటు పాల్గొన్నారు.