కేంద్ర మంత్రుల సభకు 950 మందితో భారీ బందోబస్తు


Ens Balu
6
Visakhapatnam
2023-06-10 15:55:35

విశాఖలో ఈనెల11న కేంద్ర హోం మంత్రి అమిత్ షా  విశాఖ పర్యటన, బహిరంగ సభ సందర్బంగా నలుగురు డిసిపీలు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు,04 స్పెషల్ పార్టీ లతో మొత్తముగా 950 సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డా.త్రివిక్రమవర్మ తెలియజేశారు. ఈ మేరకు శనివారం సిపి కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి  పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ,ఎయిర్పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయు పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ కేంద్ర హోం మంత్రి పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందొబస్తు ఏర్పాటు చేశామన్నారు. రైల్వే ఫుట్ బాల్ గ్రౌండ్స్ లో సాయంకాలము బహిరంగ సభ ఏర్పాటు, సభకు ప్రజలు హాజరు, ప్రముఖుల పర్యటన సందర్బముగా  ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 10వ తేది మద్యాహ్నము 02 గంటలనుండి రాత్రి 09 గంటల వరకు ఈ క్రింది తెలిపిన మార్గముల ద్వారా వాహనములు ప్రయాణించుటకు అనుమతి లేనందున ప్రత్యామ్న్యాయ మర్గాములలో ప్రయాణించి  ట్రాఫిక్ పోలీస్ కి సహకరించ వలసినిదిగా విజ్ఞప్తి చేశారు.

వాహనాల దారి మళ్లింపు ఇలా..
1)బహిరంగ సభకు వచ్చే బస్సులు TC పాలెం/28 బస్ స్టాప్ వద్ద, సదరు బస్సులు ఆశీర్వాద కళ్యాణ మండపము వైపు వున్న రోడ్ మార్జిన్ లో మరియు 
DLB గ్రౌండ్స్ లో, విశాఖ  పోర్ట్ హాస్పిటల్ వద్ద వున్న Inarbit మాల్ గ్రౌండ్స్ లో తమ తమ వాహనములలోని ప్రజలని దించిఅక్కడే పార్కు చేసుకొనవలెను. 2)బహిరంగ సభకు వచ్చే ద్విచక్ర వాహనములు  TC పాలెం/28 బస్ స్టాప్ వద్దా పార్కింగ్ చేసుకోవలెను అదే విధముగా ఆటోలు  కేంద్రీయ విద్యాలయం వరకు గల 80 ఫీట్ రోడ్ మార్జిన్ లో పార్కింగ్ చేసుకోవలెను. 3)కంచరపాలెం మెట్టు నుండి అక్కయ్యపాలెం 80 feet రోడ్ లో వున్న  మహారాణి పార్లర్ వరకు మరియు TC పాలెం నుండి DLO జంక్షన్ వరకు ఎటువంటి వాహనములు కు అనుమతి లేదు కావునా ప్రత్యామ్నాయ మర్గాలలో ప్రయాణించాల్సి వుంటుంది.  పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. నగర పర్యటన సజావుగా సాగేలా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.