క్రీడలతో మానసిక ఉత్తేజం..వంశీ


Ens Balu
2
Visakhapatnam
2020-09-27 19:53:01

క్రీడలు యువతకు మానసిక ఉత్తేజాన్ని, శారీరక శక్తిని ఇస్తాయని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఇసుకపల్లి రమాదేవి ఫుట్ బాల్ ట్రోఫీ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు ట్రోఫీ ని అందజేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, చిన్న తనంనుంచి క్రీడలు పట్ల మక్కువ కలిగే విధంగా పిల్లలు కు అవకాశాలు కల్పించాలని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రీడలను, క్రీడాకారులు ను ప్రోత్సహిస్తూ వస్తుందన్నారు. విజేతగా అప్పారావు మెమోరియల్ ఫుట్ బాల్ క్లబ్ నిలవగా, ద్వితీయ, తృతీయ బహుమలు బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్, స్వామి క్లబ్ నిలిచాయి. బెస్ట్ ప్లేయర్స్, ఉత్తమ క్రీడా కనబరిచిన వారికి కూడా ప్రత్యేక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, శ్రీధర్, వెంకట్రావు, ధర్మరాజు, సంగీతరావు, ధర్మ, మూర్తి, హిట్లర్  తదితరులు పాల్గొన్నారు.