సింహాద్రి అప్పన్నను దర్శించుకన్న తెలంగాణ గవర్నర్


Ens Balu
6
Simhachalam
2023-06-10 16:15:11

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారిని శనివారం తెలంగాణ గవర్నర్  తమిళసై సౌందర్య రాజన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నరసింహారాజు స్వాగతం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా గవర్నర్ కప్పస్తంభం అలింగణం చేసుకున్నారు. అనంతరం స్వామివా రి ఆరాధన సేవలో పాల్గొని అనంతరాలయ దర్శనం చేసుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను అందించారు. గవర్నర్ తో పాటు  రాజ్ భవన్ ఎడిసి అక్షసయ్య యాదవ్,  ఆర్డీవో భాస్కర్ రెడ్డి, పెదగంట్యాడ తాసిల్దార్ రమాదేవి, చిన్న వదిలి ఆర్ ఐ మల్లేశ్వరరావు, గోపాలపట్నం సిఐ మరియు ఎస్ఐలు, పర్యవేక్షకులు కనకరాజు, పీఆర్వో నాయుడు, ధర్మకర్త మండలి సభ్యురాలు రాజేశ్వరి లు పాల్గొన్నారు.