GVMCలో డయల్ యువర్ మేయర్, జగనన్నకు చెబుదాం


Ens Balu
16
Visakhapatnam
2023-06-11 13:45:54

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో ప్రతీ సోమవారం డయల్ యువర్ మేయర్ కార్యక్రమం ఉదయం 10 నుంచి 11 గంటలకు వరకూ, జనగన్నకు చెబుదాం కార్యక్రమం 11 నుంచి ఒంటి గంటవరకూ నిర్వహిస్తారని  మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగర ప్రజలు వారి సమస్యలను నేరుగా ఫోను ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చునన్నారు. అదేవిధంగా జనగన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా జివిఎంసీ కమిషనర్ కి ఫోన్ చేసి ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయవచ్చునన్నారు. ప్రజల సౌకర్యార్ధం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా నగరంలోని అన్నివార్డుల్లోని సచివాలయాల్లోనూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాల నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఫోను కలవలేని వారు సచివాలయాలకు వెళ్లి తమ సమస్యలు అర్జీలు సమర్పించి పరిష్కరించుకోవాలని సూచించారు.