శభాష్ విజయనగరం..


Ens Balu
3
Visakhapatnam
2020-09-27 19:59:49

విజయనగరం జిల్లా రైస్ కార్డుల పంపిణీలో రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం సాయంత్రం వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిన రైస్ కార్డుల దరఖాస్తుల లో 98.34 శాతం పరిష్కరించి జారీ చేయడం ద్వారా రాష్ట్రం లోనే మొదటి స్థానంలో నిలిచిందనీ జిల్లా కలెక్టర్ డా ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. కొత్త రైస్ కార్డుల కోసం 8749 దరఖాస్తులు రాగా వాటిలో 8631 పరిష్కరించి జారీ చేయడం జరిగిందన్నారు. కార్డుల విభజన కోసం 7491 దరఖాస్తులు రాగా వాటిలో 7348 కార్డుల్లో సభ్యులను వేరు చేసి కొత్త కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కోసం 49,441 దరఖాస్తులు వస్తె అందులో 48,598 దరఖాస్తులు పరిష్కరించి కొత్త సభ్యులను కార్డులో చేర్చడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ కార్డులకు సంబంధించి మొత్తం 65,681 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 64,577 పరిష్కరించడం ద్వారా రైస్ కార్డుల దరఖాస్తుల పరిష్కారంలో 98.32 శాతం సమస్యలు పరిష్కరించి అన్ని జిల్లాల కంటే ముందు నిలిచినట్లు తెలిపారు. జిల్లాలోని పౌరసరఫరాల శాఖ సిబ్బంది, తహశీల్దార్ లు, ఎం.పి.డి.ఓ.లు, డి.ఆర్.డి.ఏ. సిబ్బంది, మునిసిపల్ కమీషనర్ లు, సచివాలయ సిబ్బంది అందరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తిని ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తూ జిల్లాను అన్ని ప్రభుత్వ పథకాల అమలులో ముందు వరుసలో నిలబెట్టాలని సూచించారు.