ప్రజాసమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత


Ens Balu
12
Rajamahendravaram
2023-06-12 12:13:22

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు రాజమహేంద్రవరం మున్సిపల్ కమీషనర్ కె.దినేష్ కుమార్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజలు హాజరైన కమిషనర్ కు పలువురు వినతులు అందచేశారు. మంచినీరు, పారిశుద్యం, ఇంటిపన్ను మార్పు వంటి  తదితర అంశాలపై 16 మంది అర్జీలరు అందచేశారు. ఇంటి పన్ను వెయ్యడం లేదని సింహాచల్ నగర్ కి చెందిన ఏ స్వప్న,  ఏవి అప్పారావు రోడ్ నందు బాబానగర్ 6వ వీధి నివాసులు స్పిరిట్ హౌస్ కిచెన్ గది నుంచి కాలుష్యం,  డి జే శబ్ద కాలుష్యం పై పరిష్కారం కోసం ఐ. కిషోర్ కుమార్ తదితరులు, గాదాలమ్మ నగర్ వాసులు డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం, భారీ వాహనాలు వలన ఇబ్బందుల పై పలువురు అపార్ట్మెంట్ వాసులు అర్జి అందచేశారు. ఈ కార్యక్రమంలో  అదనపు కమీషనర్ పియం సత్యవేణి, సిటీ ప్లానర్ జె. సూరజ్ కుమార్, ఇతర మునిసిపల్ అధికారులు  పాల్గొన్నారు.
సిఫార్సు