PMSY ప‌థ‌కంతో మ‌త్స‌కారులు ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలి


Ens Balu
17
Vizianagaram
2023-06-30 06:24:32

ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద‌యోజ‌న ప‌థ‌కం ద్వారా మ‌త్స‌కారులు ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాల‌ని ఎమ్మెల్యే క‌డుబండి శ్రీనివాస‌రావు పిలుపునిచ్చారు. అర్థ‌నాపాలెం క్యాంపు కార్యాల‌యం విజ‌య‌గ‌న‌రం మ‌త్స్య‌శాఖ ఉప సంచాల‌కులు ఎన్‌.నిర్మ‌ల‌కుమారి, రాష్ట్ర కొప్పుల‌వెల‌మ కార్పోరేష‌న్ చైర్మ‌న్ నాయుడు బాబుల‌తో క‌లిసి పీఎంఎస్‌వై ప‌థ‌కంలో మంజూరైన 2 చేప‌ల ర‌వాణా వాహ‌నాల‌(లైవ్ ఫిష్ ట్రాన్స్ పోర్ట్ వెహిక‌ల్‌) ను మ‌త్స్య‌కారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మ‌త్స్య‌కారుల సంక్షేమానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌నరెడ్డి పిఎంఎస్‌వై ప‌థ‌కాన్ని పూర్తిస్థాయిలో ల‌బ్దిదారుల‌కు చేర్చ‌డంలోనూ, ప‌థ‌కం అమ‌లు చేయ‌డంలోనూ ప్ర‌త్యేకంగ ద్రుష్టిసారించి నిర్వ‌హ‌ణ చేప‌డుతున్నార‌ని అన్నారు.  ఫిష‌రీష్ డిడి నిర్మ‌ల‌కుమారి మాట్లాడుతూ,  పిఎంఎస్ వై ప‌థ‌కంలో యూనిట్ ధ‌ర రూ.20 ల‌క్ష‌లు కాగా ఇందులో ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌కు 60శాతం, జ‌న‌ర‌ల్ కేట‌గిరీ వారికి 40శాతం రాయితీతో అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం ఎస్సీకేట‌రిగికి ఒక‌టి, జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి అంద‌జేశామ‌న్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో మ‌త్స్య‌శాఖ అభివ్రుద్ధి కారి సిహెచ్ సంతోష్ కుమార్‌, పిఏసిఎస్ చైర్మ‌న్ జి.శివ‌, ఎల్‌.కోట ఎంపిపి  జి.శ్రీనివాస‌రావు, వేపాడ మండ‌ల‌పాల‌పార్టీ అద్య‌క్షులు ఎం.జ‌గ‌న్నాధం, కొత్త‌వ‌ల‌స జెఏసి ఇన్చార్జి బి.వెంక‌ట‌రావు, కొట్టాంసేనాప‌తి చంద‌ర్రావు, టి.శివాజీ, జి.గ‌ణేష్‌, సిహెచ్పి భీష్మ‌, సంత‌పాలెం ఎంపిటిసి వి.ర‌మ‌ణ‌,  డి.ర‌మ‌ణ‌, అప్ప‌న్న‌దొర‌పాలెం స‌ర్పంచ్ రాముల‌మ్మ‌, పి.వెంక‌టేష్‌, జ‌గ్గ‌న్న‌దొర‌, సోంబాబు, పెద‌బాబు, ఎస్‌.కోట త‌లారి అనంత‌, ఎ.ర‌మేష్‌, జి.రామానాయుడు, సిహెచ్‌.క్రిష్ణ నారాయ‌ణ‌మూర్తి మాష్ట‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.