ఆధునిక మురగునీటి శుద్ధి ప్లాంటుకి శంఖుస్థాపన..


Ens Balu
2
Tirupati
2020-09-28 14:00:48

ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో ఐదు ఎం ఎల్ డి  మురుగునీటి శుద్ధి కర్మాగారం చాలా ప్రతిష్టముగా , ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమణ కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్ వద్ద 14 కోట్ల 97 లక్షల రూపాయలతో స్మార్ట్ సిటీ నిధులతో పై 5 ఎమ్ ఎల్ డి మురుగునీటి శుద్ధి కర్మాగారం శాసనమండలి సభ్యులు యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరుపతి నగరం జీవకోన, కొర్లగుంట, సుబ్బారెడ్డి నగర్ మీదగా వచ్చే మురుగునీటి శుద్ధిచేసి, వినాయక సాగర్ లోకి పంపడం జరుగుతుందని, తిరుపతి చూపులకు వినాయక సాగర్ ఆకర్షణ గా ఉంటుందని తెలియజేశారు.  కమిషనర్ గిరీష మాట్లాడుతూ, మురుగునీటి శుద్ధి కర్మాగారం కొత్త సాంకేత పద్ధతిలో దేశంలో ఎక్కడా లేని విధంగా, మురికినీటి శుద్ధి కర్మాగారం నిర్మిస్తున్నామని, దీని ప్రత్యేకత కరెంటు బిల్లు లేకుండా ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇది పూర్తయిన వెంటనే వినాయక సాగర్ తిరుపతి పర్యటక, యాత్రికులకు ఆహ్లాదంగా ఉండేవిధంగా సాగర్ మధ్యలో ఆకర్షణీయమైన హైలాండ్, చుట్టుపక్కల సందర్శకులు కూర్చునేలా బల్లలు, చుట్టూ చెట్లు, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, జిమ్ము, యోగ చేసేదానికి స్థలము మొదలగు వాటిని నిర్మిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డి.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, స్మార్ట్ సిటీ ఏయికాం బాలాజీ, కాంట్రాక్టర్లు భానోదయ రెడ్డి, ఈశ్వర్, అమర్నాథ్, వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.