వలస కార్మికులకు అవసరమైన సహాయం అందిస్తాం..


Ens Balu
15
Vizianagaram
2023-07-05 05:30:35

తమిళనాడులోని కోయంబత్తూర్ లో మంగళవారం ప్రహరీగోడ కూలిన ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ తెలిపారు. ఈ ఘటన పై సమాచారం అందిన వెంటనే అక్కడి స్థానిక కలెక్టర్ తో మాట్లాడి మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని కోరామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయిన అనంతరం బాడంగి మండలంలోని వారి స్వస్థలాలకు తీసుకు వచ్చేందుకు సంబంధిత భవన నిర్మాణ కాంట్రాక్టర్ రవాణా ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. వలస కార్మిక కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ విరించారు. మ్రుతు కుటుంబాలకు సమాచారాన్ని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు చేరవేయాలని కూడా అధికారులను ఆదేశించారు.