సచివాలయ మహిళా పోలీసులకు శనివారం విశాఖలో కౌన్సిలింగ్


Ens Balu
21
Visakhapatnam
2023-07-21 03:58:28

గ్రామ, వార్డు సచివాలయశాఖ మహిళా పోలీసులకు జూలై 22న విశాఖజిల్లా కలెక్టర్ కార్యాలయంలో బదిలీల ప్రక్రియ జరుగుతుందని పోలీసుశాఖ ప్రకటించింది. పరస్పర బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్ధులు, డిజిపి కార్యాలయం నుంచి అప్రూవల్ వచ్చిన వారు మాత్రమే ఈ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్ధులు సదరు పనిచేసే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నో డ్యూస్ సర్టిఫికేట్ తోపాటు, ఇతర అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తోపాటు ఒక సెట్ జెరాక్సు ప్రతులతో కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి వుంటుందన్నారు. అదేవిధంగా అభ్యర్ధులు వేరే జిల్లాకు బదిలీ అయ్యే అభ్యర్ధులకు సమాచారం తెలియజేయాలని కూడా జిల్లా పోలీసు కార్యాలయం పేర్కొంది. కాగా ఇప్పటి వరకూ అన్ని శాఖల్లోని బదిలీ ప్రక్రియ పూర్తిఅయిపోయింది ఒక్క మహిళా పోలీసులకే ఆలస్యంఅయ్యింది. నేటి ఉత్తర్వులతో ఈ ప్రక్రియ కూడా శనివారంతో పూర్తికానుంది.