ఉమ్మడి విశాఖజిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27న ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్టు జెడ్పీ సిఈఓ పి.శ్రీరామ్మూర్తి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో మీడియాకి విడుదల చేశారు. మొత్తం ఏడు అంశాలను స్థాయి సంఘ సమావేశాల్లో చర్చించనున్నట్టు తెలియజేశారు. కాగా ఈ సమావేశాలకు జిల్లాశాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదికలతో రావాలని కూడా జెడ్పీ సిఈఓ పేర్కొన్నారు.