హెల్త్ కార్డు స్కీము ప్రీమియం ప్రభుత్వం చెల్లించాలి


Ens Balu
43
Anakapalle
2023-08-07 10:33:23

జర్నలిస్టుల హెల్త్ కార్డు స్కీము ప్రీమియం ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సిఎస్ఆర్ నిధుల నుంచి) ప్రభుత్వమే చెల్లించాలని  ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా యూనిట్ సభ్యులు జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని కలిసి విన్నవించారు. సోమవారం ఈ సందర్భంగా జర్నలిస్టుల అభ్యర్ధనపై కలెక్టర్ స్పందించారు. తప్పనిసరిగా హెల్త్ కార్డు విషయంలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం రాంబాబు, జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి జోగి నాయుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు కే.చంద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్ల భాస్కర్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్, పాల్గొన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అదేసమయంలో రావడంతో కాసేపు జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు.