పటిష్టంగా పరీక్షల నిర్వహణ..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-28 15:09:52

ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో పీజీ చివరి సెమిష్టర్‌ ‌పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ ‌నిబంధనలు పాటిస్తూ భౌతికదూరం పాటిస్టూ పరీక్షల నిర్వహణ జరుపుతున్నారు. ఉదయం జరిగిన పరీక్షలను ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత,  ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంద్రనాథ్‌ ‌బాబులు పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో ఆకస్మికంగా తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెక్టార్ మాట్లాడుతూ,అభ్యర్ధులు పరీక్షలకు వచ్చేటపుడు ఖచ్చితంగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ రావాలని సూచించామన్నారు. అదేవిధంగా ఖచ్చితంగా శానిటైజర్లు కూడా వినియోగించి జాగ్రత్తగా పరీక్షలకు హాజరు కావాలని ముందుగానే హెచ్చరికలు చేసినట్టు చెప్పారు. ఎవరూ పరీక్షలను వదులుకోవద్దని, అందరూ కోవిడ్ నుద్రుష్టిలో పెట్టుకొని పరీక్షలు రాయాలని ఆయన కోరారు.