జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రక్షణ.. అధికారంలోకి వచ్చాక బక్షణ.. ఇది సీఎం వైఎస్.జగన్ రెడ్డి తీరని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖలో వైఎస్సార్సీపీ నాయకులపై ఛార్జ్ షీట్ అనే కార్యక్రమం ద్వారా జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, జగన్ రెడ్డి విశాఖపట్నంలో దురాగతాలను ఎండగడుతూ.. ఇక్కడి ప్రజలను మోసం చేసిన తీరునుపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే సేవ్ విశాఖ పేరుతో జగన్ భారీ మీటింగ్ పెట్టాడని.. ప్రజలందరూ నిజమని నమ్మి జగన్ ని గెలిపిస్తే..అదే ప్రజలను ఇపుడు నట్టేట ముంచారాని ఆరోపించారు. వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చినతరువాత విలువైన భూములను దోచేశారన్నారు. నాలుగు దిక్కులా ఉన్న వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొట్టేశారని ఆరోపించారు. జగన్ విశాఖకు రావడం
శుభవార్త కాదు ప్రజలకు చేదువార్త అని అన్నారు. జగన్ విశాఖ రాకుండానే ప్రభుత్వ ఆస్తులు తనకా వంటి దురాగతాలు జరుగుతుంటే అతనొస్తే ఇంకా అనర్ధాలు జరుగుతాయొ ప్రజలు గుర్తించాలన్నారు. సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణమూర్తి, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామక్రిష్ణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, తదితరులు పాల్గొన్నారు.