చీమలాపల్లి సర్వే నెంబరు-54 వెనుక అసలు కథ..!


Ens Balu
150
Pendurthi
2023-08-08 09:52:31

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ లక్ష్మినృసింహ స్వామివారి దేవస్థానం భూములు కళ్లముందు కనుమరుగైపోతున్నాయి..చీమలాపల్లి సర్వే నెంబరు-54లోని 6.48 ఎకరాల భూమి విషయంలో జరిగిన భూ రికార్డుల భూమాయ బయటకు వచ్చిన విషయం ఇటు రెవిన్యూ, అటు దేవస్థానం అధికారులకు చెమటలు పట్టిస్తున్నది. అసలు అక్కడ ఏం జరిగింది..ఎవరు కథ నడింపించారో..దానిని మరెవరు సొమ్ము చేసుకున్నారు.. ఇంకెవరు మరోలా సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు..తదితర విషయాలను నిగ్గు తేల్చేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ న్యూస్ యాప్ Ens Live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net రంగంలోకి దిగాయి. దీనితో 
కళ్లు చెదిరే విషయాలు మా ద్రుష్టికి వస్తున్నాయి. ఈ వ్యవహరానికి సంబంధించిన వాస్తవాలను దారావాహికంగా మీముందు ఉంచబోతున్నాం.