పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్


Ens Balu
91
Anakapalle
2023-08-16 14:14:39

అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణ శెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో  నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు.  ప్రభుత్వం కల్పించే రాయితీలు, తోడ్పాటును గురించి వారికి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున అందించే ఇన్సెంటివ్ లు మంజూరు కొరకు సబ్ కమిటీని ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలన్నారు.  ఏపీఐఐసీలో పరవాడ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు విషయమై  అధికారులు పారిశ్రామికవేత్తలు విన్నవించగా కలెక్టర్ ఏపీ ఈపీ డి సి ఎల్  సిఎండి తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.  అంతకుముందు గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు గూర్చి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మెంబర్ నదియా, ఏపీఐఐసీ జెడ్. ఎం. త్రినాథ్, డిపిఓ శిరీష రాణి, డి ఆర్ డి ఏ పీ డి లక్ష్మీపతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ ఇ, అగ్నిమాపక శాఖ అధికారి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.