సుజల స్రవంతి పనులు వేగవంతం చేయాలి-మంత్రి అమర్


Ens Balu
32
Anakapalle
2023-08-16 14:16:12

అనకాపల్లి జిల్లాలో సుజల స్రవంతి పనులు మరింత వేగవంతం చేయాలని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 1876 ఎకరాల భూమిలో 1205 ఎకరాలు జిరాయితీ భూమి ఉందన్నారు. అనకా పల్లి, కసింకోట, సబ్బవరం మండలాల పరిధిలో మొత్తం 22 గ్రామాలకు చెందిన భూమిని సమీకరించాలన్నారు.  ఆరిపాక నల్లరేగు పాలెం, కొండుపాలెం లలో వెంటనే పనిని ప్రారంభించాలన్నారు.  జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మాట్లాడుతూ  సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.  ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు   సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తం భూమిలో 1025 ఎకరాలు జిరాయితీ, 476 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలింది అటవీ భూమి గా గుర్తించడం జరి గిందని అధికారులు తెలిపారు.   సేకరించిన భూమిలో పనులు వేగంగా చేయాలని, మిగిలిన భూమిని సేకరించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్ అధికారు లను ఆదేశించారు.  సమావేశంలో అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ, బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రత్యేక ఉప కలెక్టర్ కె. రమామనణి, ఇంజనీరింగ్ అధికారులు తదిత రులు పాల్గొన్నారు.