ఆర్థిక నేరాల కథనాలపై చంద్రబాబు స్పందన ఏంటి?


Ens Balu
42
Visakhapatnam
2023-09-01 15:39:35

అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన ఆర్థిక నేరాలు ఒక ఆంగ్ల పత్రిక ద్వారా బహిర్గతమయ్యాయని, ఇవన్నీ తప్పని, తాను నిజాయితీపరుడనని,ఈ కథనాలు రాసిన పత్రికపై కేసు వేయడానికి చంద్రబాబు లేదా లోకేష్ ముందుకు వస్తారా? అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ 
అమర్నాథ్ ప్రశ్నించారు. శుక్రవారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాలరు. లోకేష్ తన తల్లిని తాము పల్లెత్తు మాట కూడా అనకపోయినా, తమపై కేసులు పెట్టడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు తన తండ్రిపై వచ్చిన కథనాలు తప్పని ఆయా పత్రికలపై కేసులు వేయడానికి ముందుకు వస్తాడా? లేక నా తండ్రికి నాకు ఎటువంటి సంబంధం లేదని వదిలేస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆర్థిక నేరాలన్నీ రుజువులతో సహా బహిర్గతమయ్యాయని ఆయన అన్నారు. చంద్రబాబు ముడుపుల వ్యవహారాలు పత్రికల్లో వచ్చాయని, వాటిని ఆయన ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే, అవన్నీ నిజమేనని స్పష్టమవుతోందని అమర్నాథ్ చెప్పారు. 

గతంలో తాను అసెంబ్లీలో ఇదే అంశంపై అన్ని ఆధారాలతో సుమారు 45 నిమిషాలు మాట్లాడానని అమర్నాథ్ తెలియజేశారు. చంద్రబాబు ఆస్తులపై ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ దాడులు నిర్వహించినప్పుడు లెక్కల్లో లేని 2000 కోట్ల రూపాయలు దొరికినట్లు ఆధారాలతో సహా సంబంధిత శాఖ బహిర్గతం చేసిందని అమర్నాథ్ చెప్పారు. 2016 సంవత్సరానికి ముందు నుంచే కాంట్రాక్టర్ల దగ్గర కిక్ బ్యాగ్స్ తీసుకున్నాడని, అమరావతి నిర్మాణాలలో అవినీతి సొమ్మును డొల్ల కంపెనీలకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా బదలాయించాడో చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ ద్వారా ఇన్కమ్ టాక్స్ అధికారులు తెలుసుకున్నారని అన్నారు.  అవినీతి అంటే ఏంటో తనకి తెలియదని, అవినీతి డబ్బు తాను ఎప్పుడూ చూడలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పత్రికల్లో వచ్చిన కథనాలకు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాడని అని ప్రశ్నించారు. 
చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతి ఊబిలో కోరుకుపోయాడని, తన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందని తెలిసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నాడని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

 చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నించినా శేష జీవితంలో శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు. చంద్రబాబు ఈ జన్మలో చేసిన పాపాలు .ఈ జన్మలోనే అనుభవిస్తాడని ఆయన అన్నారు.కదా చంద్రబాబు నాయుడుకొత్తగా భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ కొత్త నిదానంతో ప్రజల ముందుకు వస్తున్నాడని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానమైనా నెరవేర్చడా? అని ఆయన ప్రశ్నించారు. రైతులను, మహిళలను పూర్తిగా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మద్దని మంత్రి అమర్నాథ్ హితవు పలికారు. చంద్రబాబు తన బుర్ర ఉపయోగించి ఒక కొత్త పథకాన్ని అయినా ప్రకటించగలిగాడా అని ఆయన ప్రశ్నించారు.