నన్నయ్య వర్శిటీ నూతన ఈసీగా డా.సులేమాన్


Ens Balu
165
Narsapur
2023-09-03 15:29:15

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నూత న కార్యనిర్వాహక మండలి (ఈసీ) సభ్యులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు మీడియాకి తెలియజేశారు. ప్రభుత్వం జీవో 77ను విడుదల చేసిందని చెప్పారు. ఆయా విభాగాల నుంచి నిష్ణాతులైన వారిని ఈసీ సభ్యు లుగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. డా.షేక్ సులేమాన్  గతంలో వైఎస్ కళాశాల అధ్యాపకుడిగా, ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధిశా ఖలో పనిచేశారు. విద్యారంగంలో ఆయనకున్న విశేష అనుభవాన్ని గుర్తించిన ప్రభుత్వం తాజాగా నన్నయ్య యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా నియమించింది. ఈయన నియామకం పట్ల ఉన్నత విద్యావంతులు, ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని ప్రొఫెసర్ జాన్ క్రిష్ఠపర్(మహర్షి), నన్నయ్య యూనివర్శిటీ విసి ఆచార్య కె. పద్మరాజు కూడా అభినందనలు తెలియజేశారు.