కోవిడ్ ను మరింతగా ఎదుర్కొంటాం..


Ens Balu
3
అనంతపురం
2020-09-28 20:00:45

 కరోనా వ్యాప్తిని అరికట్టడంలో పటిష్టమైన చర్యలు చేపట్టి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణలో ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశంతో పోలిస్తే ఏ విధంగా మెరుగ్గా ఉన్నాము అంకెల ద్వారా జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరించారు. జిల్లాలో 56,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 53403 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, డిశ్చార్జి  రేటు 95.11 శాతంగా ఉందన్నారు. 2237 యాక్టివ్ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఆక్టివ్ కేసుల్లో భారతదేశ సగటు 15.85 శాతం కాగా, రాష్ట్ర సగటు 9.60 శాతం ఉందని, అనంతపురం జిల్లాలో 3.79 శాతం కలిగి ఉందన్నారు . తద్వారా ఎక్కువమంది కోవిడ్  నుండి కోలుకొని క్షేమంగా ఇళ్లకు వెళ్లారన్నారు. దేశం మొత్తం మీద మరణాల  రేటు 1.57 శాతం ఉండగా , రాష్ట్రం మరియు జిల్లా  మరణాల శాతం సగటు 0.84 గా ఉందన్నారు. జిల్లాలో మరణాల శాతాన్ని తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో  కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి దాదాపు  10, 000 మందిని  వెంటనే ఆస్పత్రులకు మరియు కోవిద్ కేర్ సెంటర్లకు తరలించడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించగలిగా మన్నారు.  ఇంటింటి సర్వే చేసి, ప్రధానంగా 94 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్న వారిని, శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారిని, 100 ఫారన్హీట్ డిగ్రీల కన్నా ఎక్కువ జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి  ముందుగానే ఆస్పత్రులకు చేర్చడం వల్ల తక్కువ మరణాలు సంభవించాయన్నారు. జిల్లాలో సెప్టెంబర్ 27 నాటికి 4, 19, 738 పరీక్షలు నిర్వహించామని, తక్కువ పరీక్షల నుండి నెలకు 1, 40, 000 పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎదిగామన్నారు. దేశవ్యాప్తంగా సగటు న 10 లక్షల జనాభాకు 52, 000 పరీక్షలు నిర్వహించారని, రాష్ట్రంలో సగటున 10 లక్షల జనాభాకు ఒక లక్ష వరకు పరీక్షలు నిర్వహించారని, మన జిల్లాలో 10 లక్షల జనాభాలో 95000 మంది జనాభాకు పరీక్షలు నిర్వహించామన్నారు.    మార్చిలో 280 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి కరోనా సోకిందని, ఆ మాసంలో పాజిటివిటీ రేటు 0.70 శాతం కాగా, ఏప్రిల్ మాసంలో 5599 మందికి పరీక్షలు నిర్వహించగా 65 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 1.16 శాతం, మే మాసంలో 23,336 మందికి పరీక్షలు నిర్వహించగా 327 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 1.40 శాతం, జూన్ మాసంలో 35, 769 మందికి పరీక్షలు నిర్వహించగా 1687 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 4.72 శాతం, జూలైమాసంలో 84, 554 మందికి పరీక్షలు నిర్వహించగా 13, 685 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 16.18 శాతం, ఆగస్టు  మాసంలో 1,40, 262 మందికి పరీక్షలు నిర్వహించగా 25, 757 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 18.36 శాతం, సెప్టెంబర్ మాసంలో ఈనాటి వరకు 1, 28, 939 మందికి పరీక్షలు నిర్వహించగా 14, 625 మందికి కరోనా సోకి, పాజిటివిటీ రేట్ 11.25 శాతం గా నమోదైందన్నారు. ఇకనుంచి మరింత ఎక్కువగా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. మార్చి మాసంలో ఇద్దరి తో ప్రారంభమైన కరోనా కేసులు ఆగస్టు నెలలో అత్యధికంగా 18.36 శాతం పాజిటివిటీ రేటు కాగా,  ఈ నెలలో   గణనీయంగా తగ్గి,  11.25 శాతానికి తగ్గించగలిగా మన్నారు. జిల్లాలోని 12 కోవిడ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 2, 237 యాక్టివ్ కేసుల్లో, 1114 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 700 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో, 423 మంది హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈ హాస్పిటల్ లో 5000 బెడ్ల సామర్థ్యం కలిగివున్నప్పటికీ 20 శాతం బెడ్ లను మాత్రమే వాడుతున్నా మన్నారు. కోడి కేర్ సెంటర్లలో 5, 400 పైచిలుకు బెడ్ల సామర్థ్యం కలిగి ఉండగా , అందులో 700 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు వారాలుగా 19 కేటగిరీలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వాటిని ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకింగ్ లను ప్రకటిస్తోంది అన్నారు. వీటిలో జిల్లాకు రెండు వారాల్లోనూ మొదటి ర్యాంకు  వచ్చిందన్నారు.