పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయండి..
Ens Balu
3
Parvathipuram
2020-09-29 16:30:17
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో అక్టోబర్ 02, 2020న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలననుసరించి భూమిలేని గిరిజన రైతులను గుర్తించి లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. పట్టాలు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ ఆధికారి ఆర్.కూర్మనాథ్ జియ్యమ్మవలస మండలం గవరంపేట, పెద్ద మేరంగి గ్రామాలు పర్యటించి గ్రామాలలో భూమి లేని రైతులతో ముఖాముఖి మాట్లాడి వారికి భూమి ఉందా, లేదా అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దారుతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు గుర్తించిన వివరాలు అడిగి తెలుసుకొని, సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు వుంటే గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జియ్యమ్మవలస మండల తహశీల్దార్ కె.గిరిధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వి.ఆర్.ఓ లు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.