రేపటి నుంచి ఆన్‌లైన్‌ ‌శిక్షణ తరగతులు..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-29 18:34:57

ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగం నిర్వహణలో ఈనెల 30 నుంచి అక్టోబర్‌ 2‌వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌ ‌శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో మంగళవారం విడుదల చేశారు. డిజాస్టర్‌ ‌రిస్క్ ‌రిడక్షన్‌ ఇన్‌ ‌రిసెలియంట్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌’ అం‌శంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఐఐటి మద్రాసు ఆచార్యులు సి.వి.ఆర్‌ ‌మూర్తి, ఐఐఎస్‌సి బెంగళూరు ఆచార్యులు ప్రదీప్‌ ‌మంజుదార్‌,  ఎస్‌ఇఆర్‌సి చీఫ్‌ ‌సైంటిస్ట్ ‌డాక్టర్‌ ‌పి.హరి క్రిష్ణ, ఆచార్య కె.శ్రీనివాస రావు, ఐఐటి ఇండోర్‌ ‌నుంచి డాక్టర్‌ ‌నీలిమ సత్యం, ఐఐఎస్‌సి నుంచి ఆచార్య జి.ఎల్‌ ‌శివకుమార్‌ ‌బాబులు ప్రత్యేక ప్రసంగాలు అందిస్తారు. సదస్సు కన్వీనర్‌గా ఆచార్య సి.ఎన్‌.‌వి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. సదస్సుకు 550 మంది రిజిస్ట్రేషన్‌ ‌చేసుకున్నట్లు ఆచార్య సత్యనారాయణ తెలిపారు.