అక్టోబరు 13న పన్షన్ అదాలత్..
Ens Balu
7
Srikakulam
2020-09-29 18:44:24
శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా పింఛనుదారులు యొక్క సమస్యల పరిష్కరానికై అక్టోబర్ 13న పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పర్యవేక్షకులు వై.యస్.నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అక్టోబర్ 13న ఉదయం 11.00 గం.లకు సూపరింటెండెంట్ వారి కార్యాలయం, ఓల్డ్ నవత బిల్డింగ్ పైన న్యూకాలనీ, శ్రీకాకుళం – 532001 నందు సూపరింటెండెంట్ వారిచే పెన్షన్ అదాలత్ నిర్వహించబడునని ఆ ప్రకటనలో తెలిపారు. తపాలా పింఛను సర్వీసులకు సంబంధించిన ఫిర్యాదులు ఈ అదాలత్ నందు చర్చించబడునని, కావున తపాల పింఛనుదారులు తమ సమస్యలను, ఫిర్యాదులను అక్టోబర్ 5లోగా ‘’ పెన్షన్ అదాలత్ ‘’ అను శీర్షికతో “ వై.ఎస్. నరసింగరావు సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ , శ్రీకాకుళం – 532001 “ అను చిరునామాకు పంపవలసినదిగా కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఫిర్యాదుదారులు వ్యక్తిగతముగా కూడా అదాలత్ నకు హాజరుకావచ్చునని తెలియజేశారు.