అక్టోబరు 13న పన్షన్ అదాలత్..


Ens Balu
7
Srikakulam
2020-09-29 18:44:24

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా పింఛనుదారులు  యొక్క సమస్యల పరిష్కరానికై అక్టోబర్ 13న పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పర్యవేక్షకులు వై.యస్.నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు.  అక్టోబర్ 13న ఉదయం 11.00 గం.లకు  సూపరింటెండెంట్  వారి కార్యాలయం, ఓల్డ్ నవత బిల్డింగ్  పైన  న్యూకాలనీ,  శ్రీకాకుళం – 532001 నందు సూపరింటెండెంట్ వారిచే పెన్షన్ అదాలత్ నిర్వహించబడునని   ఆ ప్రకటనలో తెలిపారు. తపాలా పింఛను సర్వీసులకు సంబంధించిన ఫిర్యాదులు ఈ అదాలత్ నందు చర్చించబడునని, కావున తపాల పింఛనుదారులు  తమ సమస్యలను, ఫిర్యాదులను అక్టోబర్ 5లోగా ‘’ పెన్షన్ అదాలత్ ‘’  అను శీర్షికతో  “ వై.ఎస్. నరసింగరావు  సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ , శ్రీకాకుళం – 532001  “  అను చిరునామాకు   పంపవలసినదిగా కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఫిర్యాదుదారులు వ్యక్తిగతముగా కూడా అదాలత్ నకు హాజరుకావచ్చునని  తెలియజేశారు.