ఆ ఎన్నిక చెల్లదు...కారణం అదే
Ens Balu
3
Srikakulam
2020-09-29 19:22:36
రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుని ఎన్నిక చెల్లుబాటుకాదని జిల్లా ట్రెజరీ అధ్యక్షులు, కార్యదర్శులు యం.భాగ్యలక్ష్మీ, యస్.సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న విజయవాడలో జరిగిన ఏ.పి.టి.యస్.ఏ, అమరావతి రాష్ట్ర అధ్యక్షునిగా పేర్కొనబడిన జి.రవికుమార్ ఎన్నిక చెల్లదని అన్నారు. జి.రవికుమార్ ఏ.ఏ.ఓగా నెల రోజులు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి తదుపరి రివెర్సన్ తీసుకున్నారని, ఏ.ఏ.ఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏ.పి.టి.యస్.ఏ లో ప్రాథమిక సభ్యత్వం కోల్పోవడం జరుగుతుందని అన్నారు. పదవీ వ్యామోహంతో అధ్యక్షునిగా ప్రకటించుకోవడం సమంజసం కాదని, ఇది ట్రెజరీ ఉద్యోగులను అయోమయానికి గురిచేయడం తగదని చెప్పారు. ఈ నెల 20న విజయవాడ యన్.జి.ఓ హోమ్ లో జరిగిన సంఘ సమావేశంలో ఏ.పి.టి.యస్.ఎ బైలా ప్రకారం పి.శోభన్ బాబు గారిని ఏ.పి.టి.యస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని, దీనికి 9 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల మద్దతు ఉందని స్పష్టం చేసారు. అపరిష్కృతంగా ఉన్న ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు, అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తిచేయుటకు అవసరమైన చోట నూతన భవనాలు మంజూరు విషయమై నూతన అధ్యక్షుడిగా పి.శోభన్ బాబుతో కలిసి పనిచేస్తామని జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి ఆ ప్రకటనలో వివరించారు.