మాష్టర్ ప్లాన్ కి అనుగుణంగా అభివ్రుద్ధి..
Ens Balu
2
విశాఖపట్నం
2020-09-29 20:47:35
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అభివ్రుద్ధికి నోచుకోని ప్రాంతాలను గుర్తించి అక్కడ మౌళిక సదుపాయాలు కల్పించాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని వెలంపేట ప్రాంతాన్ని ఆమె అధికారులతో కలిసి సందర్శించి స్థానికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలు పలు సమస్యలను కమిషనర్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారులతో మాట్లాడుతూ, మాష్టర్ ప్లాన్ కు అనుగుణంగా రహదారులు, డ్రైనేజి, మంచినీటి సౌకర్యం వసతి సౌర్యాలపై వెనుకబడిన ప్రాంతాలను అధ్యయనం చేసి అభివ్రుద్ధి పనులకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ మేరకు ఆ అంశాన్ని సిసిపి విద్యుల్లతకు అప్పగించారు. అంతేకాకుండా జివిఎంసీలో అన్ని జోన్ల పరిధిలోని ప్రాంతాలను జెడ్సీలు స్వయంగా పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కూడా కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా జోన్ల ఏసీపిలు పాల్గొన్నారు.