9, 11 తరగతుల్లో ప్రవేశానికి నవోదయ నోటిఫికేషన్


Ens Balu
18
viskhapatnam
2024-10-13 14:58:38

జవహర్ నవోదయ విద్యాలయ కొమ్మాది,విశాఖపట్నం లో  2025-26 విద్యా సంవత్సరానికి గాను 9వ తరగతి మరియు 11వ తరగతి ప్రవేశ పరీక్షలకు నవోదయ విద్యాల సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.

9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవటానికి ప్రస్తుతం2024-25 విద్యాసంవత్సరం లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. 

11వ తరగతి కొరకు దరఖాస్తు చేసుకోవటానికి ప్రస్తుతం 2024-25 విద్యాసంవత్సరం లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు చేసుకొను విధానం: 
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

జవహర్ నవోదయ విద్యాలయకు  దరఖాస్తు చేసుకొను విద్యార్థినీ - విద్యార్థులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నివసిస్తునట్లు నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి..

9 మరియు 11 తరగతులకు దరఖాస్తు చేసుకొనుటకు గాను  2024 - 25 విద్యా సంవత్సరం నందు ప్రభుత్వ మరియు  ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9 మరియు 11 తరగతులు చదువుతున్న బాల బాలికలు అర్హులు.

ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2010 మే 1 నుంచి 2012 జూలై 31 మధ్య జన్మించిన వారై ఉండాలి....

ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2008 జూన్ 1 నుండి 2010 జూలై 31 మధ్యన జన్మించిన వారై ఉండాలి.


దరఖాస్తుకు చివరి తేదీ: 30/10/2024

పరీక్షా తేదీ : 08/02/2025

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్న్  వినియోగించుకోగలరు 
9 వ తరగతికి: https://cbseitms.nic.in/2024/nvsix

11 వ తరగతి :
https://cbseitms.nic.in/2024/nvsxi_11


     మరిన్ని వివరాల కోసం
          ప్రిన్సిపల్                  
 డా య.సా.శి. చంద్రశేఖర్ 
జవహర్ నవోదయవిద్యాలయ 
 విశాఖపట్నం జిల్లా