గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-4
Ens Balu
3
Amaravati
2020-09-30 07:49:43
అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా మారింది రాష్ట్రంలోని గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల పరిస్థితి... పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నారు.. అన్నిశా ఖల అధికారులు ఉన్నారు..ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారాలు ఇస్తూ 149 జీఓ జారీచేసింది...కానీ ఆ జీఓని జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీ ఓలు, సచివాయాల స్థాయిలో ఈఓపీఆర్డీలు అమలు చేయకపోవడం వలన కొత్త కార్యదర్శిలంతా అధికారాలు బదాలయింపులు జరగక సచివాలయాల్లో ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు పేరిట ఈఎన్ఎస్ లైవ్ దారావాహికం మొదలు పెట్టి...లోపాలను తెలియజేస్తూ వార్తలతో చైతన్యం తీసుకు వస్తోంది.. విశేషం ఏంటేంటే సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కలెక్టర్లు, జెసీలు, డిపిఓలు గ్రామసచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించిన తరువాత, సచివాలయాలకు వెళ్లే జిల్లా కలెక్టర్లు, జెసిలు విధులు బాగా నిర్వర్తించాలని, ప్రజలకు తెగ సేవలు చేసేయాలని సచివాలయాల్లో సిబ్బందిని హెచ్చరించి వస్తున్నారు తప్పితే... ప్రభుత్వం కార్యదర్శిలకు విధులు, డిడిఓ అధికారాలు అప్పిగించాలని ఇచ్చిన 149 జీఓని ఎందుకు అమలు పరచలేదని ఇటు డిపీఓలనుగానీ, అటు ఎంపీడీఓలను గానీ, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన తరువాత అక్కడి ఈఓపీఆర్డీలు, సీనియర్ కార్యదర్శిలను గానీ ప్రశ్నించడం లేదు. అధికారాల బదాలయింపులు గ్రేడ్-5 కార్యదర్శిలకు జరగగకపోతే, వాళ్లు ప్రజలకు ఏం సేవలు చేస్తారనే ప్రధాన సమస్యపు పరిష్కరించకుండా జిల్లాస్థాయి అధికారులు సైతం వ్యవహరించడంతో జీఓఎంఎస్ నెంబరు 149 రాష్ట్రంలోని గ్రామసచివాలయాల్లో అమలు కాలేదు. రాష్ట్రంలో కొన్నిజిల్లాల్లో జీఓనెంబరు 149ని తక్షణమే అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకు, ఈఓపీఆర్డీలకు, సీనియర్ కార్యదర్శిలకు మెమోలు జారీచేసినా నేటికీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం గ్రామసచివాలయాలకు ఒక ప్రభుత్వశాఖను రూపొందించి, వారికోసం జిల్లాల్లో ప్రత్యేక జాయింట్ కలెక్టర్లను నియమించిన తరువాత సైతం వారు కూడా ఈ జీఓ అమలుపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమ అధికారారాలు తమకు ప్రభుత్వ ఆదేశాల మేరకు బదలాయిస్తే...ప్రజలకు తాము సేవలు చేయడానికి సిద్ధంగా వున్నమంటూ, గ్రేడ్-5 కార్యదర్శిలు జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టిన తరువాత ఇచ్చిన మెమోలు సచివాలయాల్లో నేటికీ అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఎంపీడీఓలనే తెలుస్తుంది. ఎందుకంటే జిల్లా పంచాయతీ అధికారి మెమో జారీ చేసిన తరువాత మండల స్థాయిలోనూ, సచివాలయ స్థాయిలోనూ సదరు జీఓను, మెమోను అమలు చేసే బాధ్యత ఎంపీడీఓలదే. కానీ సీనియర్ పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీల ఒత్తిళ్లకు తలొగ్గిన ఎంపీడీఓలు ఆ మెమోను బుట్టదాఖలు చేయడంతో సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు లేకుండా పోయాయి. ఈ జీఓ అమలు కావాలంటే ఇపుడు ప్రధానంగా గ్రామసచివాలయ జాయింటు కలెక్టర్లు గానీ, జిల్లా కలెక్టర్లు గానీ రంగంలోకి దిగితే తప్పా ఈ జీఓ నెంబరు 149 గ్రామసచివాలయాల్లో అమలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే డిపీఓని కలిసి తమ అధికారాల కోసం అర్జీ చేసిన కార్యదర్శిలు జిల్లా కలెక్టర్ ను కలిసిన తరువాతైనా వారి అధికారాలు బదాలయింపు జరుగుతుందో లేదంటే...సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీల ఒత్తిళ్లకు తలొగ్గి..జీఓనెంబరు 149 ను కాలగర్భంలోకి కలిపేస్తారో, ఇంతకాలం ప్రభుత్వ జీఓని అమలు చేయకుండా తొక్కిపెట్టి వారిపై చర్యలు తీసుకొని గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాల బదలాయింపులు చేస్తారా అనేది వేచిచూడాలి.. అధికారాల కోసం సీనియర్, జూనియర్ కార్యదర్శిల మధ్య గొడవలు..ఆ విషయాలు గ్రామసచివాలయాల్లోని ఉత్తుత్తి కార్యదర్శిలు-5లో తెలుసుకోవచ్చు..!