విపత్తుల ప్రాణనష్టం నియంత్రిచాలి..


Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-30 18:22:02

విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించే దిశగా నిపుణులు పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఏయూ సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌విభాగం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌డిజాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐడిఎం) సంయుక్తంగా నిర్వహించిన ‘ డిజాస్టర్‌ ‌రిస్క్ ‌రిడక్షన్‌ ఇన్‌ ‌రెసిలియంట్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌’ ఆన్‌లైన్‌ ‌వెబినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ  హుద్‌హుద్‌ అనంతరం విశాఖ నగరంలో జరిగిన నిర్మాణాలలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఐఐటి మద్రాసు ఆచార్యులు సి.వి.ఆర్‌ ‌మూర్తి ఎర్త్‌క్వేక్‌ ‌రిసెస్టెంట్‌ ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌, ఐఐఎస్‌సి బెంగళూరు ఆచార్యలు ప్రదీప్‌ ‌ముజుబ్‌దార్‌ అర్బన్‌ ‌ఫ్లడ్స్- ఏన్‌ ఇవాల్వింగ్‌ ‌చాలెంజెస్‌’ అం‌శంపై ప్రసంగించారు. కార్యక్రమంలో ఏయూ ఇంజనీరింగ్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు, సదస్సు కన్వీనర్‌ ఆచార్య సి.ఎన్‌.‌వి సత్యనారాయణ రెడ్డి, డాక్టర్‌ అమీర్‌ ఆలీ ఖాన్‌, ‌విభాగాధిపతి ఆచార్య టి.వి ప్రవీణ్‌, ఆచార్య డి.ఎస్‌.ఆర్‌ ‌మూర్తి తదితరులు ప్రసంగించారు. సదస్సుకు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.