వారందరినీ చప్పట్లో అభినందించండి...
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-01 18:44:20
చిత్తూరు జిల్లాలో అక్టోబర్ 02 గాంధీ జయంతి రోజున రాత్రి 7 గం.లకు సచివాలయ ఉద్యోగులను చప్పట్లతో అభినందించే కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా అధికారులు, ప్రజలను కోరారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించి అక్టోబర్ 02 తో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు ప్రజలందరూ రాత్రి 07 గం.లకు ఇంటి బయట చప్పట్లతో అభినందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన సచివాలయ పని తీరును భారత ప్రధాని నరేంద్ర మోడి కూడా అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమం కు సంబంధించి జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలందరూ భాగస్వాములై చప్పట్లతో వారి పని తీరును అభినందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.