యుపీఎస్సీ పరీక్షకు 6802 మంది..
Ens Balu
6
Tirupati
2020-10-01 18:47:31
తిరుపతిలో ఈ నెల 4న ఆదివారం యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతి కేంద్రంగా 14 కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పగఢ్భందిగా నిర్వహణ జరగాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో యు.పి.ఎస్. సి పరీక్షల నిర్వహణపై యూపీ ఎస్సీ ఇంస్పెక్టింగ్ అధికారి న్యూఢిల్లీ ఉమేష్ పాల్ సింగ్, సంబంధిత అధికారులతో పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. సమావేశం ప్రారంభంలో పవర్ పాయింట్ ప్రజెంట్టేషన్ ద్వారా పరీక్షల నిర్వహణ ,చేపట్టవలసిన విధులపై అధికారులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి కేంద్రంగా 14 సెంటర్లలో అక్టోబర్ 4న 6802 మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ కు హాజరు కానున్నారని 7 కేంద్రాలకు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, మరో 7 కేంద్రాలకు అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. కస్టోడియన్ గా తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి వున్నారని, తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు 0877-2250201 చేశామని అభ్యర్థులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. డిఆర్వో సమన్వయ అధికారిగా వుంటారని తెలిపారు. కోవిడ్ కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సానిటేషన్, మాస్కూలు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు. ప్రతి సెంటర్ వద్ద 5 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ ఉండేలా చూడాలని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలి ,పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని , ముందురోజు నుండే ఆర్ టి సి యాజమాన్యం అభ్యర్థులకు రవాణా సౌకర్యం పై దృష్టి పెట్టాలని, ఆటోల ఏర్పాటు కూడా కొవిడ్ నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో అనుభవం ఉన్న ఆఫీసర్లు ఇప్పటికే ఎన్నో పరీక్షలు నిర్వహించిన పేరు వుంది అప్రమత్తంగా వుండాలి అన్నారు. పాజిటివ్ వ్యక్తులు, సింటమ్స్ వ్యక్తులకు ప్రత్యేక గది, పిపి ఇ కిట్లు అందుబాటులో ఉండాలి, మునిసిపల్ అధికారులు అన్ని పరీక్ష కేంద్రాలు శానిటేషన్ చేపట్టాలి అన్నారు. తిరుపతి లో లాడ్జి లు, హోటల్స్ అభ్యర్థులకు ఆకామిడేషన్, ఫుడ్ అందుబాటులో ఉండేలా సూచనలు ఇవ్వాలని సూచించారు.
యూపీఎస్సీ ఇంస్పెక్టింగ్ అధికారి ఉమేష్ పాల్ సింగ్ వివరిస్తూ ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ లు, పరీక్షా సమయం, కేంద్రాలలో పాటించాల్సిన నిబందనలు అభ్యర్థులకు అందాయని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి తమ వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు ఉంటాయని, అర్థ గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజీలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు.