దొంగతనం నాటకంతో ఉద్యోగం పోయింది..


Ens Balu
2
మడకసిరి
2020-10-01 18:55:55

అనంతపురం జిల్లాలో గ్రామసచివాలయ కార్యదర్శి ఆడిన దొంగతనం నాటకంతో ఉన్న వాలంటీర్ గిరీ శాస్వతంగా పోగొట్టుకున్నాడు. ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులను స్వాహా చేసేందుకు ప్రయత్నించిన మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయం వాలంటీర్ ఈరప్ప ను ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ప్రతి నెలా మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 రూపాయలను వార్డు వాలంటీర్ ఈరప్ప కు అందజేయగా, అతను మార్గమధ్యంలో ఎవరో కళ్లలోకి కారంకొట్టి డబ్బులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేయగా వాలంటీర్ కావాలని అసత్యాలు చెప్పినట్లు, కట్టుకథ అల్లినట్లు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.