అనంత యూపీఎస్సీ పరిశీలకునిగా కె.శశిధర్
Ens Balu
1
Anantapur
2020-10-01 19:01:30
అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సెంటర్ అబ్జర్వర్ గా ఐఏఎస్ అధికారి కోన శశిధర్ నియమితులైనట్టు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం ఈ మేరకు అబ్జర్వర్ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలను అందజేశారని ఆయన మీడియాకి వివరించారు. అనంతపురం చాలా పెద్ద జిల్లా అని, జిల్లాలోని పరీక్ష కేంద్రానికి కడప, కర్నూలు నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు సరైన సమయంలో వెన్యూ కి చేరుకునేలా చూడడం చాలా ముఖ్యమని, ఇందుకోసం స్పెషల్ బస్సులు, ట్రైన్లను అవసరమైన సమయానికి అందుబాటులో ఉంచేలా చూసుకోవాలన్నారు. అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుని పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేయాలన్నారు. వెన్యూ సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు ఎవరు ఏం చేయాలి అనేదానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు ఏడిఆర్ఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడప, కర్నూలు నుంచి అందుబాటులో ఉన్న ట్రైన్ ల వివరాలను తెలియజేశారు. 3వ తేదీ మధ్యాహ్నం అనంతరం కడప, కర్నూలు నుంచి బయలుదేరి రాత్రి 7:30 గంటల లోపల అనంతపురం చేరుకునేలా ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సమావేశంలో , జాయింట్ కలెక్టర్( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డి ఆర్ ఓ గాయత్రి దేవి, వెన్యూ సూపర్వైజర్లు, అసిస్టెంట్ వెన్యూ సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, లోకల్ ఇన్స్ పెక్టింగ్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.