జస్టిస్ ఫర్ మనీషా..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-01 20:46:41

ఉత్తరప్రదేశ్ లో 19 ఏళ్ల దళిత అమ్మాయి మనీషా వాల్మీకి నీ అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యచేయడానికి నిరసిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జస్టిస్ ఫర్ మనీషా పేరిట ఎస్సీ ఎస్టీ బిసి బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పరిశోధకులు ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమంలో సేవ్ గర్ల్, సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బిసి అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పి.అర్జున్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని వాటిని నిలువరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి  ఉత్తరప్రదేశ్ దళిత బాలిక మనీషా పై అత్యాచారం చేసిన ఘటనే నిదర్శనమన్నారు. ఆమె మరణానికి కారకులైన దుండగులను వెంటనే శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆచార్య కోటి జాన్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఉత్తరప్రదేశ్లో మనీషా లాంటి అమాయక దళిత స్త్రీలకు రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇది బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగానికి, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని వెంటనే యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి ఆచార్య మధు ,ఆచార్య రమేష్, డాక్టర్ ప్రకాష్, శిర్ల శ్యాంసుందర్, బోరుగడ్డ మోహన్ బాబు, ఆరేటిమహేష్, వెంకటేశ్వర్లు, డాక్టర్ కందుల రవికుమార్, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ ప్రసాద్, వెలిచెర్ల రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.