విశాఖలో గాంధీజీకి ఘన నివాళి..


Ens Balu
1
జివిఎంసీ గాంధీ విగ్రహం
2020-10-02 14:12:37

జాతిపిత మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధంచడానికి చేసిన సేవలు అజరామరమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. గాంధీ జయంతి సందర్బంగా శుక్రవారం విశాఖలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీజి, లాల్ బహుదూర్ విగ్రహాలుకి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, భారత దేశం నుంచి బ్రిటీషు సేనలను తరిమికొట్టడానికి గాంధీజి చేసిన ఉప్పు సత్యాగ్రహం భారతీయులందరికీ ఆదర్శమన్నారు. విదేశీ వస్త్రాలను విడనాడి, ఖాదీ వస్త్రాలనే ధరించాలన్న నినాదం స్వాతంత్య్రం పూర్వం నుంచి నేటి వరకూ గాంధేయవాదులు పాటిస్తున్న అంశమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, గాంధీజి  ఆశయాలు నేటి తరాలు కు ఆదర్శనీయం అన్నారు. నేడు భారతదేశంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ గాంధీ ఆశయంతోనే ప్రారంభమైందని పేర్కొన్నారు.