యుపీఎస్సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు..


Ens Balu
1
Anantapur
2020-10-02 16:32:47

అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల కోసం అనంతపురం వచ్చే అభ్యర్థుల కోసం కడప, కర్నూలు జిల్లాల నుంచి ప్రత్యేక ట్రైన్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.  ఈనెల 4వ తేదీన అనంతపురం సెంటర్ లో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో  ఈ నెల 3వ తేదీన 07245 అనే నెంబర్ గల ట్రైన్  కడప రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయల్దేరి ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, కల్లూరు స్టేషన్ల మీదుగా అదేరోజు రాత్రి 7:30 గంటలకు అనంతపురం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు.  అలాగే కర్నూలు   రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 3వ తేదీన 07243 అనే నెంబర్ గల ట్రైన్ సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరి  డోన్, పెండేకల్లు, గుంతకల్లు, గుత్తి, కల్లూరు మీదుగా అదే రోజు రాత్రి 8:00 గంటలకు అనంతపురం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు.    అలాగే ఈనెల 4వ తేదీన అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి 07246 అనే నెంబర్ గల ప్రత్యేక ట్రైను  సాయంత్రం 6:30 గంటలకు బయల్దేరి కల్లూరు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా 10:30 గంటలకు కడప రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీన రాత్రి 7:30 గంటలకు 07244 అనే నెంబర్ గల ట్రైన్ అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, కల్లూరు, గుత్తి, గుంతకల్లు, పెండేకల్లు, డోన్ మీదుగా కర్నూలు పట్టణానికి అదేరోజు రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుందన్నారు.   యూపీఎస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా ట్రైన్ లను ఏర్పాటు చేశామని, ఈ ట్రైన్ లకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని,  ట్రైన్స్ బయలుదేరే ముందు 4 గంటల  ముందు వరకు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రత్యేక బస్సులు కూడా.. అలాగే ఈ నెల 4 వ తేదీన అనంతపురం రీజియన్ లో 13 డిపోల నుండి 46 ప్రత్యేక  బస్సులు  ఆనంతపురానికి  ఉదయం 8 గంటలకు చేరుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. అదే రోజు  సాయంత్రం నగరం నుంచి తిరిగి గమ్య స్థానాలకు వెళ్లేలా  కూడా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా  కర్నూల్ నుండి  అనంతపురానికి ప్రతి అర గంటకు ఒక బస్సు, కడప నుండి  ఆనంతపురానికి గంటకొక బస్సు, కడప నుండి తాడిపత్రికి ప్రతి అర గంటకు ఒక బస్సు ఉందన్నారు.  అదే విధంగా  అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్కేయూ, జేఎన్టీయూ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలకు కూడ  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. 4 వ తేదీన  ఉదయం 6:30 గంటలకు అనంతపురం ఆర్ టి సి బస్టాండ్ నుంచి జెఎన్టియుకి 3 బస్సులు, ఎస్కే యూనివర్సిటీకి మూడు బస్సులు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉంటాయన్నారు. ఉదయం 7 గంటలకు బస్సులు బయల్దేరి పరీక్ష కేంద్రాలకు 8: 30 గంటల లోపు చేరుకుంటాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష కేంద్రాల వద్ద బస్సులు సిద్ధంగా ఉంటాయని, 5 గంటలకు బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ కి చేరుకుంటారు. యూపీఎస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.