గగణ తలం నుంచి విత్తన బంతులు చల్లారు..
Ens Balu
2
ఐఎన్ఎస్ డేగ
2020-10-02 20:58:08
జాతిపిత మహాత్మా గాంధీజి 151వ జయంతిని పురష్కరించుకొని నగరంలో పచ్చదనం పెంపొందించడానికి జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మొక్కల పెంపకానికి పలు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా, నగరపాలక సంస్థ ఉద్యాన విభాగం, ప్రగతి భారతి ఫౌండేషన్, తూర్పు నౌకాదళం భాగస్వామ్యంతో ఎత్తైన కొండ ప్రాంతా లలో, ఖాళీ మైదాన ప్రాంతాలలో వాయు మార్గం ద్వారా కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలైన పెదగంట్యాడ పరిసర ప్రాంతాలు, అగనంపూడి, నాయు డుతోట, చీమలపల్లి, చినముషిడివాడ, భీమిలి వద్ద పావురాల కొండ తదితర పరిసర ప్రాంతాలలో హెలికాప్టర్ ద్వారా 50వేల విత్తన బంతులను జల్లే కార్యక్రమంను చేపట్టారు. తూర్పు నావికాదళం స్థావరం INS డేగా నందు ఈ ఉత్సవ ప్రారంభ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో పాటూ, విశాఖ పార్లమెంట్ (రాజ్యసభ) సభ్యులు వి. విజయసాయిరెడ్డి, లోకసభ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ, శాసన సభ్యులు టి. నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, ఎ.అదీప్ రాజ్, తూర్పు నౌకాదళ అధికారి బిశ్వజిత్ దాస్ గుప్తా, ఇతర నౌకాదళ అధికారులు సందీప్ ప్రధాన్, కెప్టన్ పార్ధ వి. భట్ , జివిఎంసి ఉద్యానసాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.