5లోగా అధ్యాపక పోస్టుల పునరుద్దరణ..
Ens Balu
3
Srikakulam
2020-10-03 13:49:47
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల పోస్టుల పునరుద్దరణకు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5.00గం.ల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.శ్రీరాములు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఆయన కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ, గత విద్యా సంవత్సరంలో మార్చి నెలాఖరు వరకు పనిచేసిన అధ్యాపకులు మాత్రమే తిరిగి దరఖాస్తు చేస్తునోకోవాలని, వారని మాత్రమే అర్హులుగా గుర్తించడం జరుగుతుందని చెప్పారు. అధ్యాపక పోస్టుల పునరుద్దరణ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 7వ తేదీన కలెక్టర్ వారి కార్యాలయంలో నిర్వహించు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని కోరారు. ఈ అవకాశాన్ని గతంలో పనిచేసిన అద్యపకులంతా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాలలు ప్రారంభం అవుతున్న ద్రుష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు...