శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి


Ens Balu
3
Tirumala
2020-10-03 18:24:31

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్ శ‌నివారం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా  గ‌జేంద్ర సింగ్  షెకావ‌త్‌కు  శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అంద‌జేశారు. అనంతరం కేంద్రం మంత్రి మాట్లాడుతూ, ఏడుకొండల స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా వుందని అన్నారు. అదేవిధంగా భక్తుల కోసం టిటిడి చేపడుతున్న కార్యక్రమాలు కూడా చాలా బాగుతున్నాయని కూడా మంత్రి కితాబునిచ్చారు. కోరనా సమయంలో తీసుకుంటున్న చర్యల కారణంగా వైరస్ వ్యాప్త ఆలయ పరిధిలో తక్కువగా వుంటుందని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టిటిడి సివిఎస్‌వో  గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్  జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.