చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు..
Ens Balu
2
Vizianagaram
2020-10-03 18:40:42
చిరు వ్యాపారులకు, సాంప్రదాయ వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు పధకం ఎంతో లాభదాయకమని జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. వ్యాపారాలకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకోడానికి వడ్డీ లేకుండా రూ. 10 వేల బ్యాంకు రుణం అందించడం జరుగుతుందన్నారు. నెలసరి వాయిదాలను క్రమం తప్పకుండ కట్టే లబ్ది దారులకు ప్రభుత్వం వడ్డీ మొతాన్ని వారి బ్యాంకు ఖాతా లో జమ చేస్తుందని తెలిపారు. రుణాన్ని ఒక సం. లో తిరిగి చెల్లించిన వారికీ మరల 10 వేల రూపాయలను ఋణం అందించడం జరుగుతుందని తెలిపారు. కల్లెక్టరేట్ ఆడిటోరియం లో శనివారం జగనన్న తోడు, వై.ఎస్.ఆర్. బీమా , వై.ఎస్.ఆర్ చేయూత పథకాల పై బ్యాంకర్లు, గ్రామీణాబివృద్ధి , మెప్మా , టి.పి ఎం.యు కు చెందిన క్షేత్ర స్థాయి సిబ్బందితో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన లో , పించన్ల పంపిణి లో, ఈ- సర్వీసెస్ లో, జగనన్న పచ్చ తోరణం లో మన జిల్లా మొదటి స్థానం లో ఉందని, జగనన్న తోడు పథకం లో కూడా మొదటి స్థానంలో నిలపాలని కోరారు. అందుకు బ్యాంకు అధికారుల సహకారం ఎంతైనా అవసరం ఉందన్నారు. వారం లో రెండు రోజులు బ్యాంకు లు రుణాల కోసమే ప్రత్యేకంగా కేటాయించాలని కలెక్టర్ కోరారు. ప్రస్తుతం లబ్ది దారుల గుర్తింపు లో ముందున్నామని, ఇప్పటికే లక్ష 50 వేల మందిని గుర్తించడం జరిగిందని, గ్రౌండింగ్స్ లో కూడా అదే వేగాన్ని చూపించి ముందుండే లా కృషి చేయాలని అన్నారు. ఈ పథకం పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సంయుక్త కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకానికి సంబంధించి లబ్ది దారుల గ్రౌండింగ్స్ కోసం పట్టణ ప్రాంతాల్లో వార్డ్ వారీగా లక్ష్యాలను కేటాయిస్తున్నామని, వాలంటీర్ల సహకారం తో వేగంగా జరిగేలా చూడాలని అన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఒక నోడల్ అధికారిని కూడా నియమించారని వారికి ఫోన్ ద్వారా సంప్రదించి పరిష్కరించుకోవాలని అన్నారు.
వై.ఎస్.ఆర్. బీమా కోసం ఇంకనూ జన్ ధన్ ఖాతాలు తెరవని వారు వెంటనే ఖాతాలు తెరిచేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. వాలంటీర్ ఏప్ ద్వారా నమోదు చేసిన వారిలో ఇంకను 25 వేల మందికి ఖాతాలు తెరవ వలిసి ఉందని, ఈ ఖాతాల కోసం బ్యాంకు లకు అందిన దరఖాస్తులకు వెంటనే ఖాతాలను ఓపెన్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ (ఆసరా) జే. వెంకట రావు, డి.ఆర్.డి.ఎ పి.డి సుబ్బారావు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ వెంకటేశ్వర రావు, , మెప్మా పి.డి సుగుణాకర రావు, మున్సిపల్ కమీషనర్ లు, లీడ్ జిల్లా మేనేజర్ , పలు బ్యాంకు అధికారులు హాజరైనారు.