సివిల్స్ పరీక్షకు సర్వసిద్ధం..


Ens Balu
3
Anantapur
2020-10-03 18:50:00

దేశవ్యాప్తంగా నిర్వహించనున్న యూపీఎస్సీ పరీక్షలకు అనంతపురం సెంటర్ లోని వెన్యులలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈనెల 4వ తేదీన ఆదివారం రెండు సెషన్లలో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3312 మంది అభ్యర్థులు పరీక్ష లకు హాజరవుతున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 4 సెంటర్లను ఏర్పాటు చేయగా, అందులో అనంతపురం సెంటర్ ఒకటని,  జిల్లా కేంద్రంలోని 8 వెన్యూ కేంద్రాలలో పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందులో అనంతపురం శారదానగర్ లోని జెఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏ, బి సెంటర్లలో, భైరవనగర్ జేఎన్టీయూ రోడ్డులోని కేఎస్ఎన్ గవర్నమెంట్ యూజీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ లో, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు లోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ బిఎన్ డిగ్రీ కాలేజ్ ( అటానమస్)లో, టవర్ క్లాక్ వద్దనున్న గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ( అటానమస్)లో, జీసస్ నగర్లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ లో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఎస్కే యూనివర్సిటీ లో, దృష్టి లోపం ఉన్న అభ్యర్థుల కోసం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ బిఎన్ జూనియర్ కళాశాలలో వెన్యూ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.