అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు..


Ens Balu
2
Anantapur
2020-10-03 18:52:05

యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అభ్యర్థులతో ఎక్కువ చార్జీలను వసూలు చేయరాదని అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య సూచించారు. శనివారం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించే విషయంపై ఆటో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో ఆటో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించామన్నారు. పరీక్షలకు వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఆటోలలో ఇద్దరు లేదా మరీ అత్యవసర పరిస్థితిలో తప్ప ముగ్గరి కంటే ఎక్కువ మందిని ఎక్కించ రాదని సూచించారు. కరోనా నేపథ్యంలో నియమ నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులను సకాలములో పరీక్ష కేంద్రాలకు చేర్చాలని ఆదేశించారు. అభ్యర్థులతో ఎక్కువ ఛార్జీలను వసూలు చేయరాదన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ పి వి వి ఎస్ మూర్తి, ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.